యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యా్మ్’కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంట్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ.ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తున్నాడు.
కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఈ చిత్ర యూనిట్ సాహో చిత్రాన్ని ఫాలో అవుతున్నారు.
సాహో చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను గమనిస్తే అందులో మ్యూజిక్ డైరెక్టర్ పేరు మనకు కనిపించదు.
ఇప్పుడు రాధేశ్యామ్ చిత్ర పోస్టర్లోనూ ఇదే పంథాను ఫాలో అవుతున్నారు.కాగా ఈ స్ట్రాటెజీతో సాహో లాంటి బ్లాక్బస్టర్ను అందుకునేందుకు రాధేశ్యామ్ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ప్రొడ్యూస్ చేస్తోంది.దీంతో అక్కడ సాహో లాంటి విజయాన్ని ఈ సినిమా అందుకోవడమే కాకుండా ప్రభాస్తో తమ సక్సెస్ ఫార్ములాను మరోసారి కంటిన్యూ చేయాలని వారు భావిస్తున్నారు.
కాగా ఇటీవల ఈ సినిమాకు జూలియస్ పాక్యామ్ సంగీతం అందిస్తున్నాడనే వార్తలు వినిపించాయి.
ఇక పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో పూజా-ప్రభాస్ల లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.