బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు ప్రభాస్.ప్రభాస్ గత సినిమా సాహో 2019 సంవత్సరం ఆగష్టు 30వ తేదీన విడుదల కాగా ఆ సినిమా తరువాత ప్రభాస్ సినిమా ఏదీ విడుదల కాలేదు.
ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి.
అయితే గత రెండు రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాకపోవచ్చని జులై 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని రాధేశ్యామ్ నిర్మాతలు భావిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే చిత్ర యూనిట్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు ఎక్కువ సమయం కావాలని అందువల్లే సినిమా రిలీజ్ ఆలస్యమవుతోందని ప్రచారం జరుగుతోంది.
బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ప్రభాస్ కు వచ్చిన గుర్తింపు నేపథ్యంలో అన్ని భాషల్లో విడుదల చేయడానికి జులై 12 సరైన డేట్ అని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.మరోవైపు ఈ ఏడాది సమ్మర్ లో వరుసగా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ జులైకు వాయిదా పడి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్, కృష్ణంరాజు మధ్య ఉండే కొన్ని సీన్స్ మాత్రం తెరకెక్కించాల్సి ఉందని తెలుస్తోంది.
మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.ఈ ఏడాది సెకండాఫ్ లో సలార్ సినిమా విడుదల కానుండగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకునిగా ఉన్నారు.ఆదిపురుష్ సినిమా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాకు టైటిల్ ను ప్రకటించాల్సి ఉంది.
.