యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’కు సంబంధించిన ఫస్ట్ లుక్ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమా షూటింగ్ను ఎప్పుడో ప్రారంభించినా, చాలా ఆలస్యంగా షూటింగ్ జరుగుతుండటంతో ఈ సినిమా రిలీజ్పై స్పష్టత లేకుండా పోయింది.
ఇక ఈయేడు సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించడంతో శరవేగంగా షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ చేయాలని చూశారు.కానీ కరోనా వైరస్ వారి ఆశలపై నీళ్లు జల్లింది.
దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.
కానీ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.
కాగా ఈ సినిమాను వేసవి కానుకగా 2021 ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
గతంలో ఏప్రిల్ 28న ప్రభాస్ నటించిన బాహుబలి 2 చిత్రం రిలీజ్ కావడంతో ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఆ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ మూవీగా నిలిచింది.
ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ గుర్తింపును తెచ్చుకున్నాడు.మరి రాధేశ్యామ్ చిత్రంతో ప్రభాస్ ఎలాంటి రిజల్ట్ను దక్కించుకుంటాడో చూడాలి.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.