యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కి్స్తుండగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమా గురించి దర్శకుడు రాధాకృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలనె వెల్లడించాడు.
రాధేశ్యామ్ చిత్రం ఓ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలోని లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉండబోతున్నట్లు దర్శకుడు తెలిపాడు.ప్రేమలోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించనున్నాడట దర్శకుడు.ఇక ఈ సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని ఆయన అంటున్నాడు.
రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ పలికించే ఎమోషన్స్, ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేస్తాయని దర్శకుడు అంటున్నాడు.
మొత్తానికి రాధేశ్యామ్ చిత్రంతో ప్రభాస్ మరో సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అంటున్నాడు.
ఏదేమైనా ఈ సినిమాను డైరెక్ట్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని రాధాకృష్ణ అంటున్నాడు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపిస్తుండగా, అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర నిర్మాతలు భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.