బాహుబలి సిరీస్ సినిమాలకు ముందు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు.ఆ గుర్తింపు వల్లే ప్రభాస్ గత సినిమా సాహోకు డిజాస్టర్ టాక్ వచ్చినా భారీ స్థాయిలో కలెక్షన్లను సంపాదించుకుంది.
సాహో సినిమా తరువాత ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటించగా ఈ ఏడాదే రాధేశ్యామ్ సినిమా విడుదల కానుంది.
ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ కూడాఈ ఏడాదే ప్రారంభం కానుంది.అయితే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగడం లేదని సాహో సినిమా నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో నిర్మాతలు ఆశించిన స్థాయిలో రేట్లు డిస్ట్రిబ్యూటర్లు రేట్లు ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఆచార్య సినిమా స్థాయిలో రాధేశ్యామ్ మూవీ బిజినెస్ జరుగుతోందని సమాచారం.
అయితే రాధేశ్యామ్ టీజర్ విడుదలైతే మాత్రమే అంచనాలు పెరిగే అవకాశం ఉంది.అందమైన ప్రేమకావ్యంగా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో ఫైట్లు తక్కువగా ఉంటాయని పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
ఒక పాట, ప్రభాస్ కృష్ణంరాజు మధ్య కొన్ని సన్నివేశాల షూటింగ్ జరగాల్సి ఉందని తెలుస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ప్రభాస్, పూజాహెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.క్లాస్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు జస్టిస్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు.మురళీశర్మ, భాగ్య శ్రీ, ప్రియదర్శి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.