యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఒక్క బాహుబలి సినిమాతో తన మార్కెట్ ను విస్తరించుకున్నాడు.
తన మార్కెట్ చూసి బాలీవుడ్ హీరోలు సైతం భయపడుతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ వరసపెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈయన రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసాడు.ఈ షూటింగ్ మొత్తం ఎప్పుడో పూర్తయిన కొన్ని సీన్లు మళ్ళీ రీషూట్ చేయబోతున్నారని తెలిసింది.
కానీ ఇంతలో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఈ సినిమాపై కూడా పడింది.ప్రస్తుతం షూటింగ్స్ ఏమి చేయలేని పరిస్థితి.దీంతో ప్రభాస్ కూడా చేసేదేమి లేక షూటింగ్ వాయిదా వేశారు.ఇంకా షూటింగ్ బాలన్స్ ఉన్న అప్పుడే బిజినెస్ మాత్రం స్టార్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా ఓవర్శిస్ బిజినెస్ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమా పూర్తి అవ్వకుండానే థియేట్రికల్ హక్కుల కోసం అక్కడ పెద్ద ఎత్తున పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది.అంతేకాదు 3.5 మిలియన్ డాలర్స్ నుండి 4 మిలియన్ డాలర్స్ వరకు ఈ సినిమా ఓవర్శిస్ బిజినెస్ జరిగేలా కనిపిస్తుంది.దీనిపై మరింత సమాచారం రావాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.ఇది ఇలా ఉండగా రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతుంది.
రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.యువీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా జులై 30 న విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా ఈ సినిమా అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు.ప్రభాస్ ఈ సినిమాతో పాటు మరొక రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కుతుండగా.ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతుంది.