డార్లింగ్ ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పీరియాడికల్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా పారిస్ నేపధ్యంలో నడిచే కథాంశంగా ఉండబోతుంది.
పూజా హెగ్డే ఇందులో ప్రభాస్ కి జోడీగా నటించింది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ పోస్టర్ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది.ఈ సినిమా ద్వారా రాధాకృష్ణ ప్రేక్షకులని మరో లోకంలోకి తీసుకుపోవడం గ్యారెంటీ అనే టాక్ వినిపించింది.
ఇక సినిమా ఫస్ట్ లుక్ కి హిందీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపధ్యంలో ఇప్పుడు రాధేశ్యామ్ హిందీ రిలీజ్ కోసం నిర్మాతలు పోటీ పడుతున్నారు.
వీరిలో ముందు వరుసలో బడా నిర్మాత కరణ్ జోహార్ ఉన్నాడు.బాహుబలి సినిమాని హిందీలో రిలీజ్ చేసి కరణ్ జోహార్ బాగానే వెనకేసుకున్నాడు.
ఇక ప్రభాస్ సాహూ సినిమాకి హిందీలో బాగానే లాభాలు వచ్చాయి.ఈ నేపధ్యంలో ఇప్పుడు రాధేశ్యామ్ కి గట్టిగా పోటీ ఏర్పడినట్లు తెలుస్తుంది.
ప్రభాస్ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తే వంద కోట్లు గ్యారెంటీ అనే టాక్ వచ్చేయడంతో కరణ్ జోహార్ ఎట్టి పరిస్థితిలో సినిమాని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు.అయితే ఇదే సమయంలో వేరొక నిర్మాత కూడా పోటీలోకి రావడంతో ఈ సినిమాకి డిమాండ్ పెరిగింది.
ఇక ఆ పోటీని దృష్టిలో ఉంచుకొని హిందీ రైట్స్ ని భారీ ధరకు అమ్మాలని యూవీ నిర్మాతలు భావిస్తున్నారు.