యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఇంకా రిలీజ్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తనదైన శైలిలో పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు రాధాకృష్ణ తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.2021లో లవ్ అండ్ రొమాన్స్కు స్వాగతం పలుకుదామని రాధాకృష్ణ ట్వీట్ చేశాడు.దీంతో రాధేశ్యామ్ చిత్ర రిలీజ్కు సంబంధించి ఈ ట్వీట్ ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న రాధేశ్యామ్ చిత్రాన్ని ఎట్టకేలకు 2021లో ఖచ్చితంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందని వారు అంటున్నారు.
ఇక ప్రభాస్ వింటేజ్ లుక్లో ఈ సినిమాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
మరి రాధేశ్యామ్ చిత్రాన్ని 2021లో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని పక్కనబెడితే, ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువగా నెలకొంది.
కాగా ఈ సినిమాను రాధాకృష్ణ చాలా ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తుండగా, యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తు్న్నాయి.జస్టిన్ ప్రభాకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.