ప్రభాస్‌ ‘ఓ డియర్‌’ షూటింగ్‌ ఆగిపోలేదన్న డైరెక్టర్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘ఓ డియర్‌’ చిత్రంను రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.దాదాపుగా 250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్నారు.

 Radha Krishna Give The Clarity About O Dear Movie Shooting Post Poned-TeluguStop.com

ఈ సినిమాను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం అయ్యింది.దాంతో సినిమా విడుదల విషయంలో క్లారిటీ రావడం లేదు అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చాలా రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.

Telugu Prabhas, Prabhasradha, Prabhas Corona, Prabhas Jaanu, Prabhas Latest, Pra

ప్రభాస్‌ ఓ డియర్‌ చిత్రం షెడ్యూల్‌ ప్రకారం ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరపాలి.కాని కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌ను క్యాన్సిల్‌ చేశారంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది.సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు దర్శకుడు రాధాకృష్ణ చెక్‌ పెట్టాడు.ఇటీవలే సినిమాకు సంబంధించి ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించాం.హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ను ఇందుకోసం ఉపయోగించినట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చాడు.

యూరప్‌లో ఇంకా చిత్రీకరణ చాలా బ్యాలన్స్‌ ఉందంటూ ఆయన చెప్పాడు.

యూరప్‌లో ప్రస్తుతం యాక్షన్‌ ఎపిసోడ్‌ పూర్తి అయిన కారణంగా ఇక సాంగ్‌ చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.అందుకు సంబంధించిన వర్క్‌ చక చక జరుగుతుందని సమాచారం అందుతోంది.

మొత్తానికి కరోనా వల్ల ఓ డియర్‌ షూటింగ్‌ ఆగిందని వచ్చిన వార్తలు నిజం కాదని తేలిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube