టాలీవుడ్లో డబ్బింగ్ చిత్రాలకు సైతం ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తూ వాటిని ఆదరిస్తూ వస్తున్నారు.కంటెంట్ ఉన్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు పట్టం కడుతారని ఇప్పటికే పలుమార్లు నిరూపించారు.
ఇక రొమాంటిక్ కథలకు ఇక్కడి ప్రేక్షకులు మంచి ఆదరణను చూపిస్తూ వాటిని సక్సె్స్ చేస్తూ వస్తున్నారు.ఈ కోవలోనే మలయాళ హీరో దుల్కర్ సాల్మన్ నటించిన ఓకే బంగారం, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.
కాగా ఈ హీరో ప్రస్తుతం తెలుగులో స్ట్రెయిట్ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నాడు.
దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో హీరోగా దుల్కర్ సాల్మన్ నటించనున్నాడు.
కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కుమార్తెలు స్వప్నా, ప్రియాంకా దత్లు నిర్మిస్తుండటంతో ఈ సినిమా ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాలో మరో హీరోయిన్ను తీసుకునేందుకు రెడీ అయ్యింది.సెకండ్ హీరోయిన్గా అందాల భామ రాశి ఖన్నాను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
దీంతో సౌత్లో మంచి క్రేజ్ ఉన్న పూజా హెగ్డేతో పాటు రాశి ఖన్నా అయితే తమ సినిమాకు మంచి బజ్ వస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఇద్దరు హీరోయిన్లను వారు సెలెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఈ సినిమాలో దుల్కర్ సాల్మన్ ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడట.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను జనవరి నుండి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి ఈ మలయాళ హీరో తెలుగు ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.