టాలీవుడ్లో అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకుల మనసుల్ని దోచిన బ్యూటీ రాశి ఖన్నా ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ బ్యూటీ చేసే ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలుస్తుండటంతో అమ్మడిని అందరూ లక్కీ బ్యూటీగా భావిస్తున్నారు.
కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం దర్శకుడు మారుతి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తోంది.మారుతి తెరకెక్కించిన లాస్ట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’లో కూడా రాశి ఖన్నా హీరోయిన్గా నటించగా, అమ్మడి పర్ఫార్మెన్స్ నచ్చిన మారుతి మరోసారి ఆమెను తన సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాడు.
ఇక మ్యాచో స్టార్ గోపీచంద్తో గతంలోనే జిల్ అనే సినిమాలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.ఇప్పుడు మరోసారి గోపీచంద్తో యాక్ట్ చేస్తుండటంతో ఈ కాంబోను మరోసారి ప్రేక్షకులు ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ చిత్ర యూనిట్లో నెలకొంది.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తన పాత్ర తనకు చాలా దగ్గరగా ఉండటంతో రాశి ఖన్నా ఉత్సాహంగా కనిపిస్తోంది.
అంతేగాక చిత్ర షూటింగ్ సెట్స్లో కూడా ఆమె సందడి చేస్తూ కనిపిస్తోంది.తాజాగా దర్శకుడు మారుతితో ఆమె చేసిన కామెడీకి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ సినిమా షూటింగ్ సెట్స్లో డైరెక్టర్ మారుతి దగ్గర రాశి ఖన్నా ఆశీర్వాదం తీసుకుంటున్నట్లుగా, ఆమెను దర్శకుడు మారుతి దీవిస్తున్నట్లుగా ఉన్న ఫన్నీ ఫోటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ ఫోటో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంద.
ఈ సినిమాలో రాశి పాత్ర ఎంతలా ఆమెను ఇంప్రెస్ చేసి ఉండకపోతే, ఇంత సరదాగా అమ్మడు ఉంటుందని వారు అంటున్నారు.ఏదేమైనా పక్కా కమర్షియల్ చిత్రం అమ్మడికి పక్కా హిట్ అందిస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.