తెలుగులో ఆ మధ్య ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర కఠారి దర్శకత్వం వహించిన రాణి అనే చిత్రం ఓటిటి ప్లాట్ ఫారమ్స్ లో విడుదలయిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్వేతా వర్మ హీరోయిన్ గా నటించగా ప్రవీణ్ యండమూరి, కిషోర్ మారిశెట్టి, సురభి శ్రావణి, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
కాగా ఈ చిత్రాన్ని నూతన సినీ నిర్మాత నజియా షైక్ నిర్మించింది.
నూతన నటీనటులతో తెరకెక్కించిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేయడంతో ఓటిటిలో విడుదల చేశారు.నూతన నటీనటులతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగానే అలరించింది.కాగా తాజాగా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన నజియా షైక్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కోసం తాము ఎదుర్కొన్న కష్టాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తయిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ కోసం దాదాపుగా మూడు నెలలపాటు సెన్సార్ కార్యాలయం చుట్టూ తిరిగామని తెలిపింది.
అయితే ఎట్టకేలకు 2019 వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని ఆ తరువాత ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు గాను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చింది.అయితే కంటెంట్ పరంగా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ విడుదల విషయంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయానని దాంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫారంలో విడుదల చేయగా లాభాలు రాకపోయినప్పటికీ ఈ చిత్రం కోసం చేసిన అప్పులు మాత్రం తీరాయని అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు రాఘవేంద్ర కఠారి అనుకున్న బడ్జెట్లోనే ఈ సినిమాని తెరకెక్కించడం కోసం చాలా కష్టపడ్డాడని అలాగే విడుదల విషయంలో కూడా ఎంతో సహాయం చేశాడని తెలిపింది.
ఒకానొక సమయంలో ఓ ప్రముఖ ఐటి సంస్థలో ఉద్యోగం చేశానని ఆ సమయంలో తాను థాంక్యూ, సారీ, ప్లీజ్ అనే పదాలను ఎలా ఉపయోగించాలనే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నానని తెలిపింది.అయితే ఓ మంచి పని చేసినప్పుడు సినిమా పరిశ్రమలో గుర్తింపు దక్కడం లేదని ఈ విషయం తనను ఎంతగానో కలచివేస్తోందని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.కాగా ఒకానొక సమయంలో తాను డబ్బులు తీసుకోకుండా కూడా సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యానని అంతగా సినిమా మీద ప్యాషన్ తో వచ్చానని తెలిపింది.
అయితే ఈ విషయం కూడా ఉండగా ఇటీవలే నజియా షైక్ భూమి అనే షార్ట్ ఫిలింలో కూడా నటించింది.