బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో ఢీ కార్యక్రమం ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి కేవల్ తమంగ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
అంత చిన్న వయసుకి కేవల్ బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నాడు.వీలైనంత వరకు అతనికి బ్లడ్ సహాయం చేయండి అంటూ గత కొద్ది రోజుల క్రితం యష్ మాస్టర్, ప్రియమణి సోషల్ మీడియా వేదికగా సహాయాన్ని కోరారు.
అయితే రోజురోజుకు కేవల్ పరిస్థితి దారుణం గా ఉండటంతో అతనికి కీమో చేయడానికి ఏకంగా 15 లక్షలు అవసరమయ్యాయి.
ఈ మేరకే కేవల్ వైద్యానికి అవసరమయ్యే డబ్బులను సహాయం చేయమని పలువురు సెలబ్రిటీలను కోరుతున్నారు.
ఈ క్రమంలోనే యశ్ మాస్టర్ భార్య కేవల్ వైద్యం కోసం బుల్లితెర నటుడి భార్య మేఘనను సంప్రదించారు.ఈ క్రమంలోనే మేఘన 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ.ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.జీవితం అందరికీ ఎంతో విలువైనది దయచేసి మీకు తోచిన సహాయం చేసి అతని ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 27 ఏళ్ల వయసులోనే తమ కొడుకు ఈ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు అని తెలిసి ఆ తల్లిదండ్రులు ఎంత బాధ పడుతున్నారో అంటూ మేఘన కాస్త ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే కేవల్ కి సహాయం చేయడానికి ఆట సందీప్ కూడా ముందుకు వచ్చాడు.కరోనా సమయంలో తన భార్యతో కలిసి చేసిన డాన్స్ వీడియోలకు ఫండ్స్ సేకరిస్తే సుమారు 10 లక్షల వరకు వచ్చాయి.వీటితో ఎంతోమంది అనాథలకు అన్నదానం చేసాము.
ఇప్పుడు కూడా మీరు సహకరిస్తే కేవల్ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దామని తెలిపారు.