ప్రస్తుతం ఉన్న హాట్ బ్యూటీల్లో రాయ్ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తనదైన అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న ఈ బ్యూటీ, ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది.
అయితే ఎక్కువగా ఐటెం సాంగ్స్కే పరిమితం అయిన ఈ బ్యూటీ, బాలీవుడ్లో ‘జ్యూలీ 2’ చిత్రంతో అదిరిపోయే ఫాలోయింగ్ను క్రియేట్ చేసుకుంది.ఇక అప్పటి నుండి అక్కడే ఎక్కవగా సినిమాల్లో నటిస్తూ తన అందాలను ఎరగా వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కాగా ప్రస్తుతం వెబ్ సిరీస్లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో అమ్మడు కూడా అందులోకి అడుగుపెడుతోంది.గతంలో వచ్చిన ‘పాయిజన్’ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.
దీంతో ఇప్పుడు ఈ వెబ్సిరీస్కు రెండో పార్ట్ను తెరకెక్కిస్తున్నారు.ఇందులో రాయ్ లక్ష్మీ, అఫ్తాబ్ శివ్దసాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఈ వెబ్ సిరీస్లో రాయ్ లక్ష్మీ రెచ్చిపోయి నటించనుందట.ఇందులోని కొన్ని సీన్స్లో అమ్మడు నూలుపోగు లేకుండా కనిపిస్తుందట.
అసలే అందాల ఆరబోత అంటే ఎక్కువ ఇష్టపడే ఈ బ్యూటీ, ఇప్పుడు మరింత రెచ్చిపోనుంది.ఇక ఈ వెబ్ సిరీస్తో పాటు కన్నడలో ఝాన్సీ అనే యాక్షన్ డ్రామా చిత్రంలోనూ అమ్మడు నటిస్తోంది.
ఇందులో రాయ్ లక్ష్మీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటం విశేషం.తెలుగులో ఐటెం సాంగ్స్కే పరిమితం అయిన ఈ బ్యూటీ, మళ్లీ టాలీవుడ్లో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది.
మరి పాయిజన్ 2 రాయ్ లక్ష్మీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.