తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కథానాయికగా పనిచేసిన రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూశారు.ఇక హీరోయిన్ తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవిడ సోషల్ మీడియా ద్వారా తన భావోద్వేగాన్ని తెలియజేసింది.
ఇందులో భాగంగానే ఆవిడ తన నాన్న గురించి డాడ్.ఐ మిస్ యూ.నేను ఈ బాధను అధిగమించలేకపోతున్నాను అంటూ తెలియజేసింది.ఇక ముందు ఈ లోటు తోనే జీవించేందుకు తాను ప్రయత్నిస్తానని.
మీరు నన్ను ప్రేమించిన విధంగా ఎవరు ప్రేమించరని, మా నాన్న ఇక లేరని చెబుతుంటే తన గుండె ముక్కలవుతుంది అని తెలుపుతూనే.కాపాడుకోవడానికి తాను ఎంతగానో ప్రయత్నించాను కానీ రక్షించుకోలేకపోయాను అని క్షమించండి అంటూ వాపోయింది.
కాలం కలిసి వచ్చి ఉంటే అంతా సజావుగా ఉంటే.తన పక్కన ఎన్నో విషయాలు చెప్పుకోవడానికి మీరు ఉంటే బాగుండేది అని తన మనసులో మాట చెప్పింది.
తన జీవితంలో బలం, అలాగే తనకు ఏం కావాలన్నా మీరు ఇచ్చారంటూ తెలిపింది.వీటితో పాటు తాను మీ కుమార్తె కావడంతో తను ఎంతో అదృష్టవంతురాలు అని నేను ఎప్పుడూ స్వేచ్ఛగా దూరంగా ఉండాలని మీరు ఎప్పుడు కోరుకునే వారిని తెలిపింది.
ఇకపోతే ప్రస్తుతం తన తండ్రి నొప్పి, బాధ లేని ప్రశాంతమైన చోటులో ఉన్నాడని అది నా మైండ్ కు తెలుసు అని చెప్పుకొచ్చింది.ఇదే విషయాన్ని తన మనసు కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేసింది.
అంతేకాకుండా మీరు ఎక్కడ ఉన్నా సరే నన్ను ఆశీర్వదిస్తారని ముందుకు నడిపిస్తారని తెలియజేసింది.
అలాగే తన తండ్రి నన్ను నమ్మారు అని, ఆయన కోరిన కోరికను తాను తప్పకుండా నెరవేరుస్తానని అందుకు మీరు గర్వించేలా చేశానని తెలిపింది.
అలాగే బంగారు మనసున్న వ్యక్తి హృదయం ఆగిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.ప్రస్తుత సమయం నా జీవితం లోనే అంధకారంతో కూడుకున్న సమయం అంటూ చెబుతూనే ఆయన ఇంత నొప్పిని భరించడం ఇష్టంలేక దేవుడు తన దగ్గరికి తీసుకెళ్ళాడు అంటూ రాయ్ లక్ష్మి ఉద్వేగాన్ని వ్యక్తపరిచింది.
ఇక చివరగా మీ ఆత్మకు శాంతి చేకూరాలి.మిమ్మల్ని మేము ఎంతో మిస్ అవుతున్నాం ఐ లవ్ యూ అంటూ లక్ష్మి తన బరువెక్కిన హృదయంతో తన భావాలని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచింది.