మల్టీ లెవల్ చైన్ లింక్ బిజినెస్ మోసాలు ఇండియాలో ఎక్కువగా జరుగుతూ వుంటాయి.ప్రజల ఆశని అవకాశంగా చేసుకొని చాలా మంది గొలుసు కట్టు వ్యాపారాలలో భారీ లాభాలు చూపిస్తూ డబ్బులు జమ చేసుకొని తరువాత బోర్డు తిప్పేస్తూ వుంటారు.
ఇప్పటికే ఇలాంటి మోసాలకి అలవాటు పడిన తెలుగు ప్రజలని క్యూనెట్ సంస్థ మల్టీ లెవల్ బిజినెస్ పేరుతో వందల కోట్లలో మోసం చేసింది.ఇక ఈ కేసుని సైబరాబాద్ పోలీసులు విచారిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఇక ఈ క్యూనెట్ కేసులో తాజాగా సైబరాబాద్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించి తాజాగా పలువురు ప్రముఖులకి నోటీసులు జారీ చేసారు.ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు క్యూనెట్ సంస్థ ద్వారా లబ్దిపొందినట్లు భావిస్తూ బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులకి నోటీసులు జారీ చేసింది.
క్యూనెట్ తరుపున ప్రచారం చేసిన సినీ ప్రముఖులకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసారు.ఇక పోలీసులు నోటీసులు జారీ చేసిన వారిలో కొన్ని కంపెనీల సిఈఓలు, అలాగే క్రికెటర్స్ కూడా వున్నట్లు తెలుస్తుంది.
సుమారు 500 మందికి నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు వారికి వారం రోజులలోగా విచారణకి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.