మనం ఏ క్షణం ఏమరపాటుగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదు.కొన్ని సార్లు మనం గుడ్డి నమ్మకంతో అసలు మనం ఊహించని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.
కాని వాటిని మనం ముందుగానే ఊహించి సమయస్పూర్తితో వ్యవహరిస్తే మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు మనకు కనిపిస్తాయి.ఇక అసలు విషయంలోకి వెళ్తే కొండచిలువలు ఈ మధ్య జనావాసాల మధ్య సంచరించడం పరిపాటుగా మారింది.
ఎవరు వాటిని గమనించకపోతే పెద్ద ఎత్తున ప్రాణాపాయాలు తప్పవు.ఒక వేల కొండచిలువను మనం ముందుగా గమనించినా కూడా దానిని చాకచక్యంగా పట్టుకొనే వారు మన చుట్టుప్రక్కల లేకుంటే అది మరింత భయానక పరిస్థితి ఉంటుంది.
తాజాగా ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో రెండు కొండచిలువలు కలకలం సృష్టించాయి.ఆ పరిసరాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్న సమయంలో అందులో పనిచేస్తున్న కూలీలకు కొండచిలువలు కనబడడం జరిగింది.
వెంటనే కూలీలందరు అప్రమత్తమై గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న కొంత మంది చాకచక్యంగా దాన్ని పట్టుకొని అడవి ప్రాంతంలోకి వదిలేశారు.జేసీబీలోకి దూరడంతో వాటిని వెలికితీశారు.
ఏది ఏమైనా పెద్ద ప్రమాదం నుండి వారు బయటపడ్డారనే చెప్పవచ్చు.
.