పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఖరి చిత్రం అజ్ఞాతవాసి.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది.ఆ తరువాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రి ఇచ్చి జనసేన పార్టీని కూడా స్థాపించాడు.2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుండి పోటిచేసిన పవన్ కళ్యాణ్ ఒక్క సీట్ తో సరిపెట్టుకున్నాడు.ఆ తరువాత పవన్ కూడా పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు.కానీ అభిమానులు మాత్రం పవన్ మరల సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు.కానీ పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి రెస్పాన్సు రాలేదు.తన జీవితం ప్రజా సేవకే అంకితం అన్నట్లు గా ఉన్నాడు.
కానీ ఈ మద్య కొంత మంది సినిమా నిర్మాతలు మరియు ప్రొడ్యూసర్స్ పవన్ ని కలిసి సినిమాలు చెయ్యలిసిందిగా కోరడం మీ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచుస్తున్నరుంటూ పవన్ తో చెప్పడం జరిగిందంట.తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మరల మేకప్ వేసుకోవడానికి సిద్దం అవ్వుతున్నట్లు తెలుస్తుంది.టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ తో పవన్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.బాలీవుడ్ లో విజయవంతమైన పింక్ చిత్రాన్ని తెలుగులో పవన్ పవన్ కళ్యాణ్ చేయ్యనున్నట్లు సమాచారం.
పింక్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు.పింక్ చిత్రాన్ని తెలుగులో వేణు శ్రీ రామ్ డైరక్ట్ చేయ్యనున్నాడు.త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన రానున్నది.తమిళ వెర్షన్ పింక్ లో అజిత్ నటించాడు.