నటుడిగా కెరీర్ ఆరంభించిన బండ్ల గణేష్ అనూహ్యంగా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.పవన్ ఇచ్చిన ప్రోత్సాహంతో నిర్మాతగా బాగానే సినిమాలు చేశాడు.
కాని సినిమాకు ఎక్కువ బడ్జెట్ పెట్టడం నష్టాల పాలవ్వడం జరిగింది.దాంతో బండ్ల గణేష్ నిర్మాతగా పూర్తిగా నష్టపోయాడు.
చాలా చోట్ల అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.దాంతో ప్రస్తుతం ఆయన మళ్లీ నటుడిగా కెరీర్ను ఆరంభించాడు.
రోజు వారి లక్ష పారితోషికంతో బండ్ల గణేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నాడు.
అంతా సాఫీగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి తన ఇంటిపై దాడికి ప్రయత్నించారంటూ బండ్ల గణేష్ మరియు ఆయన అనుచరులపై కేసు పెట్టాడు.
టెంపర్ సమయంలో పీవీపీ నుండి బండ్ల గణేష్ అప్పుగా తీసుకున్నాడు.ఆ సినిమా విడుదల సమయంలో కొంత మొత్తం చెల్లించగా బ్యాలన్స్ అమౌంట్ను బండ్ల గణేష్ జరుపుతూ వస్తున్నాడు.
ఆయన్ను సీరియస్గా అడగడంతో పీవీపీ ఇంటిపైకి మనుషులను పంపించి బెదిరించాడట.
పీవీపీ ఇంటికి వెళ్లిన కొంత మంది బండ్ల గణేష్ను మళ్లీ డబ్బులు అడిగితే చంపేస్తాం అంటూ బెదిరించారట.దాంతో వెంటనే పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు బండ్ల గణేష్పై సెక్షన్ 448, 506 నమోదు చేశారు.
ఆయన్ను అరెస్ట్ చేసేందుకు కూడా సిద్దం అయ్యారు.కాని పోలీసులకు చిక్కకుండా బండ్ల గణేష్ తప్పించుకున్నాడు.
ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడో ఆచూకి తెలియడం లేదు.పోలీసులు బండ్ల గణేష్ కోసం జల్లెడ పడుతున్నారు.
బెయిల్ మంజూరు అయిన తర్వాత బండ్ల గణేష్ పోలీసుల ముందు హాజరు అయ్యే అవకాశం ఉంది.