బండ్ల గణేష్ మరియు పీవీపీల మద్య ఆర్థిక వివాదం పోలీసులు, కోర్టు వరకు వెళ్లింది.బండ్లగణేష్కు చెందిన ముగ్గురు మనుషులు తన ఇంటికి వచ్చి బెదిరించేందుకు ప్రయత్నించాడు అంటూ పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
దాంతో ఆ ముగురితో పాటు బండ్ల గణేష్పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.బండ్ల గణేష్ను అరెస్ట్ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
ఇదే సమయంలో బండ్ల గణేష్ కూడా రివర్స్ కేసును పీవీపీపై నమోదు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో పీవీపీ మీడియాతో మాట్లాడుతూ.
చాలా ఏళ్లుగా బండ్ల గణేష్తో నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి.టెంపర్ చిత్రం విడుదల సమయంలో ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేదు.7 కోట్ల బ్యాలన్స్ అమౌంట్తో మిగిలిన మొత్తం ఇచ్చాడు.అప్పటి నుండి కూడా 7 కోట్లను అడుగుతూనే ఉన్నాం.
కాని ఆయన మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు.ఇటీవల పార్క్ హయత్ హోటల్లో కలిసిన సందర్బంగా 1.8 కోట్లు కదా మీకు ఇవ్వాల్సింది అన్నాడు.అప్పుడు నేను 7 కోట్లు ఇవ్వాలని చెప్పాడు.
అందుకు నాకు మంత్రి బొత్స సత్యనారాయణ తెలుసు మరియు హోం మంత్రి సుచరిత తెలుసు అంటూ ఇండైరెక్ట్గా బెదిరించాడు.నాతో పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు గెలవలేవు అంటూ నన్ను బెదిరించాడంటూ పీవీపీ చెప్పుకొచ్చాడు.