బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో బయోపిక్ ల ట్రెండ్ జోరుగా సాగుతోంది.చాలామంది దర్శకులు నిజ జీవిత కథలను స్ఫూర్తిగా తీసుకొని వాటిని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా క్రీడా రంగంలో రాణించిన వారి సక్సెస్ స్టోరీస్ ని తెరపై దృశ్యరూపంలో ప్రజలు చేస్తున్నారు.ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు బయోపిక్ లు సినిమాల రూపంలో వచ్చాయి.
వాటిలో ఎక్కువగా హిట్ టాక్ తెచ్చుకున్నవే ఉండటం విశేషం.నిజ జీవిత కథలు ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంటారు.
అయితే ఇలాంటి మోషన్స్ లేని ఒక లైఫ్ స్టోరీ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా డివైడ్ టాక్ తెచ్చుకుంటాయి.గతంలో అజారుద్దీన్ బయోపిక్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
తాజాగా పరిణీతి చోప్రా లీడ్ రోల్లో సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ మూవీ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేదు.ఇదిలా ఉంటే మరో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బయోపిక్ ని తెరకెక్కించడానికి సోనూసూద్ సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా చేయించారు.
అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.ఇదిలా ఉంటే తాజాగా తన బయోపిక్ పై పి వి సింధు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తన బయోపిక్ పై వస్తున్న సినిమాల్లో దీపిక పదుకొనే అయితే తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని సింధు చెప్పుకొచ్చింది.దీపిక పదుకొనే కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెరీర్ ప్రారంభించింది.
తర్వాత యూటర్న్ తీసుకుని హీరోయిన్ గా సక్సెస్ అయింది.ఈ నేపథ్యంలో దీపిక అయితే తన పాత్రకు పర్ఫెక్ట్ అని సింధు చెప్పడం విశేషం.