భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విశాఖపట్టణం జిల్లా విమల విద్యాలయానికి చెందిన విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది.ఈ సందర్భంగా 2024 లో జరగబోయే ఒలంపిక్స్ లో… బంగారు పతకం సాధిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అంతే కాకుండా ఏ పని చేసిన దాన్ని ఎంజాయ్ చేయాలని విద్యార్థులకు పి.వి.సింధు సూచించింది.ఉక్కు స్టేడియం దగ్గర ఫ్రీడం రన్ ప్రారంభించి.
ఇండోర్ స్టేడియం స్టూడెంట్ లతో కలిసి బ్యాడ్మింటన్ ఆడడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని క్రీడా విభాగాలలో ఉత్తమ ప్రదర్శన అందించిన క్రీడా విద్యార్థులకు పీవీ సింధు పథకాలు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయని వాటిని నమ్మకంతో.ఓర్పుతో గెలవాలని విద్యార్థులకు సూచించింది.
జీవితంలో గెలుపోటములు సహజం.కొద్ది నెలలు కొద్దిరోజులు మాత్రమే కాక జీవితంలో ఎన్నో సంవత్సరాలు నమ్మకంతో కష్టపడితేన్నే తాను కూడా పైకి వచ్చినట్లు.
ఈ రోజు ఈ స్థితిలో ఉన్నట్లు విద్యార్థులకు పీవీ సింధు తెలిపింది.ప్రతి ఒక్కరూ కష్టపడాలని.
ఎంజాయ్ చేస్తూ చదవాలని.ఎంజాయ్ చేస్తూ ఆడాలని.
ప్రతి కష్టాన్ని అధిగమించి సాధించాలని విశాఖ విద్యార్థులకు సూచించింది.