తెలుగు నేల నుంచి జాతీయ స్థాయికి ఎదిగి ప్రధానమంత్రిగా పని చేసిన గొప్ప రాజకీయ నాయకుడు పీవీ నరసింహారావు.కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబానికి చెందిన వారి కనుసన్నల్లో నడుస్తుంది.
అలాంటి పార్టీలో నెహ్రూ కుటుంబం నీడ తనపై పడకుండా పరిపాలనలో తనదైన ముద్ర వేసిన దార్శనీకుడుగా పీవీ నరసింహారావుకి మంచి గుర్తింపు ఉంది.అనేక బాషలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా, రచయితగా కూడా పీవీ తనదైన ముద్ర వేసుకున్నారు.
చివరి రోజుల్లో కాస్తా అవమానాలకి గురైన కూడా దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత పుంజుకోవడంలో పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలు ఏదో గొప్పగా పని చేసాయాని ఆర్ధిక నిపుణులు ఇప్పటికి చెబుతూ ఉంటారు.ఇదిలా ఉంటే పీవీ నరసింహారావు తెలుగువాడు అని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరు గర్వపడతారు.
అలాంటి గొప్ప వ్యక్తి కథని తెరపై ఆవిష్కరించడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు.
తెలుగులో ఈ బయోపిక్ ని రూపొందించడానికి ప్రణాలికలు సిద్ధం అవుతున్నాయి.ఎన్టీఆర్ ఫిలిమ్స్ బ్యానర్ లో తాడివాడ రమేష్ నాయుడు ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకొచ్చారు.అలాగే సీనియర్ దర్శకుడు దవల సత్యం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారని తెలుస్తుంది.
జాతీయ స్థాయి నటుడు ఈ మూవీలో పీవీ నరసింహారావు పాత్రలో నటిస్తారని సమాచారం.ఇక పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు నిర్మాత స్పష్టం చేశారు.
ఇక వచ్చే ఏడాది జూని 28న పీవీ జయంతి రోజున బయోపిక్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.మరి ఈ బయోపిక్ లో ఇందిరాగాంధీ పాత్రని నెగిటివ్ షేడ్స్ లో చూపిస్తారా, పీవీ రాజకీయ జీవితంలో వివాదాస్పద అంశాలని టచ్ చేస్తారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.