ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టీ.ఆర్.
ఎస్ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు.ప్రతిపక్షాలు ఓట్ల కోసం ఇప్పుడు కాళ్లు మొక్కుతారని.
వాళ్ల కబుర్లు నమ్మితే ఐదేళ్ల పాటు జరిగే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు అజయ్ కుమార్.తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం నుండి కోట్ల రూపాయల నిధులు ఖమ్మం నగర అభివృద్ధి కోసం వెచ్చించామని.
ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అన్నారు అజయ్ కుమార్.కార్పొరేషన్ లో టీ.ఆర్.ఎస్ గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని.ప్రతి పక్షాలు మాటలు మాత్రమే చెబుతాయని అభివృద్ధి చేయడం వారి వల్ల కాదని అన్నారు.ఇక ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత ఆరోపణల మీద స్పందించిన అజయ్ కుమార్ ఓటమి భయంతోనే అలా మాట్లాడుతున్నారని.
ఈ ఎన్నికల్లో వారిని ఓడించాలని ప్రజలకు చెప్పారు అజయ్ కుమార్.
ఖమ్మం కార్పొరేషన్ విజయాన్ని సిఎం.
కే.సి,ఆర్ కు కానుకగా ఇవ్వాలని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.ప్రచారంలో భాగంగా డివిజన్లలో తుమ్మల ప్రహారం చేశారు.ధంసలాపురం బ్రిడ్జి, గోళ్లపాడు ఛానెల్ ఆధునీకరణ, డంపింగ్ యాడ్ స్థలం మార్పు వంటి విషయాలు సిఎం పరిశీలనకు వెళ్లాయని.
వఆటి పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.