పుట్టపర్తి సత్యసాయి బాబాది సహజం మరణం కాదట…! పథకం ప్రకారం చేసిన హత్యట…! సాయిబాబా చనిపోయిన నాలుగేళ్ల తరువాత ఆయన కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి (కజిన్) ఆయనది సహజ మరణం కాదని అంటున్నాడు.గణపతి రాజు అనే ఆయన సత్యసాయి బాబాకు కజిన్.
బాబా మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఇప్పుడు చెబుతున్నారు.సాయిబాబా మరణంపై సిఐడి విచారణ జరిపించాలని గణపతి రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాబా మరణం వెనక అజ్ఞాత శక్తులు ఉన్నాయని, వేల రూపాయలు చేతులు మారాయని అంటున్నారు.బాబా అనారోగ్యంతో ఉండగానే ట్రస్టు సభ్యలు శవపేటిక తెప్పించారని, రెండు ట్రక్కుల నిండా పూలు కూడా తెప్పించారని, దీన్నిబట్టి చూస్తే ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా అనుమానం కలుగుతోందని ఆరోపించారు.
బాబా మెడికల్ రిపోర్టుల మీద, చేయించిన వైద్యం మీద అనుమానాలు ఉన్నాయన్నారు.బాబా మీద రెండుసార్లు కొందరు దాడులు చేశారని చెప్పారు.
ఇన్ని ఆరోపణలు ఇప్పుడు చేసిన గణపతి రాజు నాలుగేళ్లుగా ఎందుకు ఊరుకున్నాడు? ఇప్పుడు అనుమానాలు ఎందుకు, ఎలా కలిగాయి? మరి ఈయన వెనక ఎవరున్నారో…!
.