దర్శకుడు పుష్పదీప్ భరద్వాజ్ దర్శకత్వంలో రియా చక్రవర్తి, వరుణ్ మిత్ర జంటగా నటించిన చిత్రం జిలేబి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు భరద్వాజ్.మొదటి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే రంజీష్ హీ సహీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను మరొకసారి పలకరించాడు దర్శకుడు పుష్పదీప్ భరద్వాజ్.
ఇందులో తాహిర్ రాజ్ భసిన్, అమృతా పూరి తో పాటు సౌత్ ఇండస్ట్రీ బ్యూటీ అమలాపాల్ కూడా నటించింది.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ కి ప్రేరణ ఎవరు అన్న ప్రశ్నకు ఆలియాభట్ తండ్రి మహేష్ భట్ అంటున్నాడు దర్శకుడు పుష్పదీప్ భరద్వాజ్.
రంజీష్ హీ సహీ వెబ్ సిరీస్ ఒక దర్శకుడి కథ.ఒకవైపు కట్టుకున్న భార్య.మరొకవైపు స్టార్ హీరోయిన్.వీళ్లిద్దరి మధ్య సదరు దర్శకుడి కీ జరిగే మానసిక సంఘర్షణను దర్శకుడు పుష్ప దీప్ వెబ్ సిరీస్ గా తెరకెక్కించాడు.ఈ కథకు ప్రేరణ ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ ఇచ్చిన సమాచారం అంటున్నాడు పుష్ప దీప్.ఇక అప్పట్లో హీరోయిన్ పర్వీన్ బాబి తో భట్ ప్రేమ కథ చాలా పాపులర్ అయింది.
ఇక వారిద్దరి మధ్య జరిగిన కొన్ని నిజజీవిత సన్నివేశాలను దర్శకుడు పుష్ప దీప్ వెబ్ సిరీస్ గా తెరకెక్కించాడు.
కాని తన ప్రాజెక్టు పూర్తిగా మహేష్ భట్ బయోగ్రఫీ కాదు అంటున్నాడు పుష్ప దీప్.అందులో కొంత మహేష్ భట్ బయోగ్రఫీ ని కలిపి, కొంత ఫిక్షన్ కలిపి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాను అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ వూట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మరి ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.