సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.అల్లు అర్జున్ మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పుష్ప నుండి విడుదలైన ఇంట్రడక్షన్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఈ టీజర్ విడుదలయ్యి కేవలం 20 రోజులు మాత్రమే అవుతుంది.
కేవలం 20 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ రాబట్టింది.ఇంత తక్కువ సమయంలో 50 మిలియన్ల మార్క్ టచ్ చేసిన టాలీవుడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ వీడియో కు లైక్స్ కూడా బాగానే వచ్చాయి.ఈ వీడియో 1.2 మిలియన్ లైక్స్ దక్కించుకుంది.
ఈ వీడియో ఇప్పటికి కూడా ట్రెండింగ్ లో ఉంది. పుష్పరాజ్ వీడియో తో అల్లు అర్జున్ తన స్టామినా మరొకసారి నిరూపించుకున్నాడు.ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు. రష్మిక మందన్న ఒక గిరిజన యువతి గా నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
కరోనా సెకండ్ వేవ్ సమయం లో అందరు షూటింగ్ వాయిదా వేసుకుంటుంటే సుకుమార్ మాత్రం మొండి ధైర్యం తో ఇంకా షూటింగ్ చేస్తున్నాడు.
కొద్దిమంది సభ్యులతో షూటింగ్ కానిచ్చేస్తున్నారు.ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో పుష్ప షూటింగ్ జరుగుతుంది.మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాను స్వతంత్ర దినోత్సవ సందర్భం గా ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.