స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాతో అదిరిపోయే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాతో పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసిన బన్నీ, తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.
కాగా బన్నీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే తొలి షెడ్యూల్ను కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమాను సుకుమార్ తనదైన శైలిలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు సుక్కు.
ఇక ఈ సినిమాలో బన్నీ చాలా మాస్ లుక్లో మనకు కనిపించనున్నాడు.ఇప్పటికే బన్నీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.కాగా ఈ సినిమా షూటింగ్లో భాగంగా తొలి షెడ్యూల్ను కేరళలో నిర్వహించేందుకు ఏకంగా రూ.3 కోట్ల మేర బడ్జెట్ను కేటాయించారు.అయితే కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ‘పుష్ప’ చిత్ర యూనిట్, ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ వల్ల కేరళ షెడ్యూల్ను వాయిదా వేసింది.ఇక ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే, కేరళలో షూటింగ్ జరగకపోవచ్చని తెలుస్తోంది.
అయితే కేరళ షెడ్యూల్ కోసం రూ.3 కోట్లు కేటాయించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఆ బడ్జెట్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మిగిలిందని ఆందోళన చెందుతున్నారు.ఒక్క కేరళ షెడ్యూల్ కోసమే ఇంత బడ్జెట్ కేటాయించగా, ఇప్పుడు అది కూడా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండబోతుందని వారు అంటున్నారు.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.