స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో బన్నీ నాన్-బాహుబలి రికార్డును క్రియేట్ చేసి తన సత్తా చాటాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.ఇక ఈ సినిమా అందించిన సక్సెస్తో తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను బన్నీ ఇప్పటికే ప్రారంభించాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది.అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోకముందే వాయిదా పడింది.
అయితే ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ను అతి త్వరలో ప్రారంభించి, కేవలం ఒక్క షెడ్యూల్లోనే ఈ సినిమా మెజారిటీ భాగాన్ని పూర్తి చేయాలని సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
ఈ ఏడాది ముగిసే సిరికి 70 శాతం షూటింగ్ పూర్తి చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు.
బన్నీ కూడా ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం అవుతుండటం, తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు ఓకే చేయడంతో, పుష్ప చిత్రాన్ని వీలైనంత త్వరగా ముగించేయాలని బన్నీ చూస్తున్నాడు.
మరి ఇంత స్పీడుగా ఈ సినిమాను పూర్తి చేయడం అయ్యే పనేనా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.