అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పుష్ప.ఈ సినిమా చిత్రీకరణ కరోనా సెకండ్ వేవ్ లోనూ జాగ్రత్తలు తీసుకుని జరుపుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
దర్శకుడు సుకుమార్ శిష్యులు ఆ విషయం నిజమే అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.సుకుమార్ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారని వారు చెప్పారు.
ఇటీవల అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ అంటూ వెళ్లడి అయ్యింది.దాంతో పుష్ప సినిమా చిత్రీకరణ నిలిపి వేసి ఉంటారు అంటూ అంతా అనుకుంటున్నారు.
ఈ సమయంలోనే అల్లు అర్జున్ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు.మళ్లీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేం అంటూ కొందరు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతూనే ఉందట.షూటింగ్ ను నిలిపి వేసినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికి కూడా షూటింగ్ చేస్తూనే ఉన్నారు.ప్రస్తుతం ఫహాద్ ఫాజల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.భారీ అంచనాలున్న ఈ సినిమాను ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నాడు.అందుకే ఆయన ఈ సినిమా ను కాస్త కష్టం అయినా ఈ పరిస్థితుల్లో షూట్ చేస్తున్నాడు.
అల్లు అర్జున్ కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారు.ఒకరు ఇద్దరు ఇబ్బంది అనిపించిన వారు షూటింగ్ కు దూరం అయ్యారు.
మిగిలిన వారు అంతా కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఈ సినిమా షూటింగ్ లో బన్నీ మే రెండవ లేదా మూడవ వారంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
ఆయన కరోనా నుండి కోలుకున్న తర్వాత షూటింగ్ లో జాయిన్ అవుతాడు అంటున్నారు.