స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీపుష్పఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ ఇద్దరి కాంబోలో ఈ సినిమా హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్లో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, పుష్ప చిత్రంపై అంచనాలను ఓ రేంజ్లో సెట్ చేశాయి.కాగా ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుండటంతో ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం అడవి ప్రాంతంలో జరుపుకుంటోంది.
అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ అడవిని వీడి పట్నంలో మకాం వేశారు.సినిమా కథ పరంగా కొన్ని సీన్స్ను పట్నంలో కూడా తెరకెక్కించాల్సి ఉండటంతో ప్రస్తుతం పుష్ప చిత్ర షూటింగ్ను హైదరాబాద్లో జరుపుకుంటున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
అయితే హైదరాబాద్లో పుష్ప చిత్రం షూటింగ్ ఎక్కడ జరుగుతుందనే విషయం మాత్రం చిత్ర యూనిట్ సస్పెన్స్గా ఉంచారు.
పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోండగా, ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.
ఇక విలన్ పాత్రలో ఈ సినిమాలో ఓ స్టార్ నటుడు నటిస్తున్నాడని, అతడికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి.