స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
గతంలో బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలవడంతో, ఈసారి వచ్చే సినిమా వీరి కాంబోలో హ్యాట్రిక్ కొడుతుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇక పుష్ప చిత్రం పూర్తి మాస్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమా షూటింగ్ను లాక్డౌన్ తరువాత ఇటీవల మారేడుమిల్లి అడవుల్లో తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్లో మనకు కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ను వారణాసిలో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.వారణాసి నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఒకట్రెండు పాటలు కూడా ఇక్కడ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో బన్నీ పాత్ర పేరు పుష్పక్ రాజ్గా ఉండబోతున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్గా రష్మిక మందన నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఇప్పటికే పలువురి పేరు ఈ జాబితాలో వినిపించినా, ఇంకా ఎవరూ ఈ సినిమాలో విలన్గా ఎంపిక కాలేదని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై కేవలం సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది.
మరి ఈ సినిమాలోని వారణాసి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.