సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.
ఇక సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.రంగస్థలం తర్వాత మరోసారి పక్కా మాస్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.
దీంతో పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే చాలా వరకు పెద్ద సినిమా షూటింగ్ లు నిలిపేశారు.
సెకండ్ వేవ్ సిచువేషన్ కంట్రోల్ అయిన తర్వాత షూటింగ్ లు స్టార్ట్ చేసుకుందామనే ధ్యాసలో అందరూ ఉన్నారు.
అయితే పుష్ప ముగింపు దశలో ఉండటంతో సుకుమార్ మాత్రం కొంత వరకు కోవిడ్ నిబంధనలు తీసుకొని చిత్రీకరణ కొనసాగించారు.
అయితే ఇంతలో అల్లు అర్జున్ కరోనా బారిన పడి క్వారంటైన్ లో ఉంటున్నారు.అయిన సుకుమార్ అల్లు అర్జున్ లేని సన్నివేశాలు షూట్ చేయాలని భావించారు.
పరిస్థితి రోజురోజు కి విషమించడంతో పాటు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం, అలాగే కరోనా మరణాలు కూడా ఎక్కువ కావడంతో సినిమాలో విలన్ గా నటిస్తున్న ఫాహద్ ఫైజల్ ఇక షూటింగ్ లో తాను పాల్గోనలేనని చెప్పేసి కేరళ వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.దీంతో తప్పనిసరి పరిస్థితిలో సుకుమార్ షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చిందని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.