అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా హిందీలో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఏదో డబ్బింగ్ చెప్పించి విడుదల చేయడం కాకుండా పుష్ప సినిమా లో బాలీవుడ్ స్టార్స్ ను నటింపజేయడం మొదలుకుని పాటల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్దను కనబర్చుతున్నట్లుగా తెలుస్తోంది.
కొన్ని క్లోజప్ షాట్స్ ను హిందీ భాషలోనే చిత్రీకరించడంతో పాటు పాటలను హిందీలో ప్రత్యేకంగా రికార్డ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం పుష్ప సినిమా కు సంబంధించిన పాటల రికార్డింగ్ జరుగుతుంది.
ఇప్పటికే కొన్ని పాటల చిత్రీకరణ జరిగింది.రెండు పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉందట.
ఆ బ్యాలన్స్ ఉన్న పాటలను తెలుగు మరియు హిందీలో వేరు వేరు గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. div class=”middlecontentimg”>
పుష్ప సినిమా కు సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న విషయం తెల్సిందే.ఆయనకు హిందీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.గతంలో దేవి శ్రీ పాటలు చాలా హిందీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఇటీవల రాధే సినిమా లోని సిటీ మార్ పాట కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చిందే.కనుక అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం కూడా హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ప్రత్యేకంగా రెండు పాటలను ట్యూన్ చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆ రెండు పాటలకు కొరియోగ్రపీ చేయబోతున్నాడు.బాలీవుడ్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ ను స్పెషల్ గా ట్యూన్ చేస్తున్నారా లేదంటే అన్ని భాషలకు కూడా ఒకే ఐటెం సాంగ్ ను చూపించబోతున్నారా అనేది చూడాలి.
రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మలయాళ స్టార్ నటుడు పాహద్ ఫాజిల్ ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నాడు.