అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.డిసెంబర్ రెండవ వారంలో విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మెల్ల మెల్లగా షురూ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.
రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్ గా పుష్ప పార్ట్ 1 విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.సుకుమార్ మరియు బన్నీల గత చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్.
అలాగే బన్నీ గత చిత్రం పాటలు బ్లాక్ బస్టర్.అందుకే పుష్ప పాటల విషయంలో ఎక్కువ ఫోకస్ ఉంది.
అందుకే మొదటి పాటను ఫుల్ మాసీగా విడుదల చేసిన దేవిశ్రీ ప్రసాద్ కు అందరి ప్రశంసలు దక్కాయి.తప్పకుండా ఈ సినిమా నుండి రాబోతున్న మరిన్ని పాటలు కూడా ఆహా అన్నట్లుగా ఉంటాయి అనే టాక్ వినిపిస్తుంది.
రికార్డు బ్రేకింగ్ బడ్జెట్ ను ఖర్చు చేస్తూ రూపొందిస్తున్న పుష్ప సినిమా నుండి రెండవ పాటను విడుదల చేయబోతున్నారు.
మొదటి పాట పూర్తిగా అల్లు అర్జున్ బ్యాక్ గ్రౌండ్ లో సాగింది.ఆయన పాత్ర మరియు ఆయన తీరును పాటలో చూపించారు.ఇక రెండవ పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.
ఈ సినిమా రెండవ పాటను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా గతంలోనే మేము తెలియజేయడం జరిగింది.ఇప్పుడు అదే నిజం కాబోతుంది.ఈనెల 13వ తారీకున దసరా కానుకగా పుష్ప నుండి రెండవ పాటను విడుదల చేసేందుకు సిద్దం అంటూ ప్రకటన వచ్చింది.అధికారింగా విడుదల చేసిన ప్రకటనలో రష్మిక మందన్నాపై ఈ పాట ఉంటుందని అంటున్నారు.
శ్రీవల్లి శ్రీవల్లి అంటూ సాగే ఈ పాట లో రష్మిక పాత్రను డిస్కవర్ చయబోతున్నట్లుగా చెబుతున్నారు.ఆ తర్వాత మూడవ సాంగ్ ను దీపావళికి విడుదల చేస్తారు.
మొత్తంగా సినిమా విడుదల వరకు అన్ని పాటలను నెట్టింట ట్రెండ్ చేయాలని బన్నీ అండ్ టీమ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.