సైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.
పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.
రష్మిక మందన్న ఒక గిరిజన యువతిగా నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అల్లు అర్జున్ తన నటనతో ఫ్యాన్స్ ను కట్టిపడేసాడు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
ఈ సినిమాను 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన కారణంగా అనుకున్న సమయానికి రాలేకపోవచ్చు.
ఒకవేళ షూటింగ్ పూర్తి చేసుకున్న కరోనా కారణంగా థియేటర్స్ కు వచ్చి చూసే ఇంట్రెస్ట్ ఇప్పట్లో ప్రేక్షకులు పెట్టకపోవచ్చు.
ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ లో విడుదల కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు ఈ సినిమా దసరా రేస్ లోకి రాబోతుందని వార్తలు వస్తున్నాయి.పుష్ప చిత్ర యూనిట్ కరోనా తగ్గుముఖం పడితే మిగతా సినిమాలన్నీ ఆగస్టులో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి పుష్ప సినిమాను దసరాకు విడుదల చేయాలనీ అనుకుంటున్నారని సమాచారం.
చూడాలి మరి ఇది జరుగుతుందో లేదో.