టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కేరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విషయం అందరికి తెలిసిందే.కానీ సమంత తన కేరీర్ లో మొట్టమొదటి సారిగా ఐటెం సాంగ్ చేసింది.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో బన్నీ తో కలిసి ఐటమ్ సాంగ్ కు స్టెప్పులను ఇరగదీసింది.ఇక సమంత చేసిన ఐటమ్ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.
ఈ పాట ఏ ముహూర్తాన రిలీజ్ అయ్యిందో కానీ అప్పటి నుండి ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది. సమంతా కూడా ఆ పాటలో తన డాన్సుతో, ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను హుషారెత్తించింది.
ఇక ఈ పాటని రీ క్రియేట్ చేస్తూ ఇప్పటికే ఎంతో మంది సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా పుష్ప సినిమా రిలీజ్ తర్వాత ఈ పాటకు స్టెప్పులు వేయని సెలబ్రిటీ లేరు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సమంతా చేసిన ఆ స్పెషల్ సాంగ్ సీక్రెట్ చెబుతూ సమంత పై కామెంట్స్ చేశారు.ఈ పాటలో సమంతను తీసుకోవాలన్న నిర్ణయం పూర్తిగా దర్శకనిర్మాతలదే నని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు.
ఇక ఈ పాట రికార్డింగ్ అయి పోయిన తర్వాత కూడా ఇందులో ఎవరు నటిస్తారు అన్నది ఫైనల్ కాలేదని, ఇక చివరికి దర్శక నిర్మాతలు బాగా ఆలోచించి ఈ పాటలో సమంత అయితే బాగుంటుంది అని చెప్పి సమంతను తీసుకున్నారు అని తెలిపాడు దేవి శ్రీ ప్రసాద్.ఆ పాట కోసం సమంతను ఫైనల్ చేసిన రెండు రోజుల ముందు తనకు ఆ విషయం తెలిసిందని, పాటకు సమంత బాగా సెట్ అయింది అని దేవి చెప్పుకొచ్చారు.సమంత డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటకు ఫ్రెష్ ఫీల్ వచ్చిందని దేవీ శ్రీ ప్రసాద్ తెలిపారు.