ఈమద్య కాలంలో హీరోలు తమ అభిమానులతో రెగ్యులర్ టచ్ లో ఉండేందుకు గాను సోషల్ మీడియాలో అధికంగా ఉంటున్నారు.తమ అభిమాన హీరో చిన్న అప్డేట్ వచ్చినా దాన్ని ట్రెండ్ చేసేందుకు సిద్దం అవుతున్నారు.
సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో చూసుకుంటే సోషల్ మీడియాలో అత్యధికంగా వైరల్ అవుతున్న స్టార్ గా అల్లు అర్జున్ నిలిచాడు.వరుసగా మూడు నెలలు కూడా ఆయన ట్విట్టర్ ట్రెండ్ లో నెం.1 గా కొనసాగుతున్నట్లుగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.టాలీవుడ్ స్టార్స్ లో అత్యధికంగా ట్విట్టర్ ఇండియాలో ట్రెండ్ అయిన స్టార్ గా అల్లు అర్జున్ నిలిచాడు.
ఆయన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.కొన్ని రోజుల ముందు పుష్ప ను హిందీలో విడుదల చేయడం లేదు అంటూ వార్తలు వచ్చాయి.
దాంతో దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు నెట్టింట పెద్ద యుద్దమే చేసినట్లుగా చేశారు.అంతకు ముందు కూడా పుష్ప కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తూ ఉండటం వల్ల.
పాటలను విడుదల చేస్తూ ఉండటం వల్ల ట్విట్టర్ లో అత్యధికంగా అల్లు అర్జున్ ను చూస్తూ వచ్చారు.ట్విట్టర్ లో అల్లు అర్జున్ పేరు వరుసగా మూడు నెలలు ట్రెండ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.
ఇలా చాలా అరుదుగా జరుగుతుందని అంటున్నారు.
ఏ హీరో సినిమా విడుదల రిలీజ్ కు ఉంటే ఆ సినిమా వల్ల ఆ నెల వరకు లేదా 15 రోజుల వరకు సోషల్ మీడియాలో హడావుడి కనిపిస్తుంది.కాని పుష్ప వల్ల గత మూడు నెలలుగా అల్లు అర్జున్ ట్విట్టర్ లో టాప్ లో ట్రెండ్ అవ్వడం ను అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.