ప్రతి ఒక్క సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే అంటున్న హీరోలు.సాంగ్ తగ్గట్టు గ్లామర్ బ్యూటీ లను ఎంచుకోవడంలో కూడా ప్లాన్ చేస్తుంటారు నిర్మాతలు.
ఇక స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఐటమ్ సాంగ్ కు చేసే ఏర్పాట్లు అంతో ఇంతో కాదు.ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమాలో ఐటమ్ సాంగ్ తెరకెక్కనుండగా దానికి ఓ ఐటమ్ గర్ల్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్ కోసం కొన్ని ఏర్పాటు చేశారు.కాగా ఈ పాట తమన్ పాడనున్నట్లు తెలపగా ఈ పాట కోసం డాన్స్ చేసే ఐటమ్ భామ గురించి బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేల్ల ను ఎంపిక చేసారట.
కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షూట్ ల కోసం మహేష్ బాబు, పరశురాం దుబాయ్ వెళ్లారు.అంతేకాకుండా మహేష్ బాబు తన భార్య పుట్టినరోజు వేడుకలు కూడా అక్కడే జరపనున్నారు.
ఇదిలా ఉంటే ఊర్వశి రౌతేల్ల మరో స్టార్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు తెలిసాయి.సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఫ్యాన్ ఇండియా ఫిలిం పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ సరసన తను ఓ ఐటమ్ సాంగ్ కు డాన్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ అందించనున్నాడు.
కాగా ఈ సినిమాలో ముందుగా ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ నటి దిశా పటానికి అవకాశం ఇవ్వగా.తాను అడిగిన పారితోషకం తో చిత్ర నిర్మాతలు ఊర్వశి ని ఎంచుకున్నారు.
ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ సినిమా లలో ఒకేసారి రెండు ఐటమ్ సాంగ్ లను బాలీవుడ్ నటి చేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.
.