ఎట్టకేలకు ప్రేక్షకుల ఎదురు చూపులు ఫలించాయి.ఎన్నో రోజులుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
కానీ పుష్ప పార్ట్ 1 హిట్ అయిన ఇంత వరకు పార్ట్ 2 స్టార్ట్ చేయలేదు.అయితే ఈ సినిమా స్టార్ట్ అయినట్టు కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్న ఫ్యాన్స్ అయితే నమ్మడం లేదు.
ఎందుకంటే మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించలేదు.
పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు.
ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా హిందీలో కూడా వసూళ్ల సునామీ సృష్టించింది.
పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ అంచనాలే పెరిగాయి.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ కు అన్ని సిద్ధం అయ్యాయి.మేకర్స్ కూడా వైజాగ్ లో అడుగు పెట్టి షూట్ స్టార్ట్ చేయడానికి సిద్ధం అయ్యారు.హార్బర్ బ్యాక్ డ్రాప్ లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను సుకుమార్ తెరకెక్కించ బోతున్నట్టు టాక్.
వైజాగ్ లో దాదాపు 10 రోజుల పాటు షూట్ జరగనున్నట్టు తెలుస్తుంది.
అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ చేయనున్నారట.ఇక వైజాగ్ లో యాక్షన్ ఘట్టాల కోసం ఆర్ట్ డైరెక్టర్ పర్యవేక్షణలో కత్తులని, ఎర్రచందనం దుంగలను సిద్ధం చేస్తున్నారు.దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలను చూసి ఈసారి షూట్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు.మైత్రి మూవీ మేకర్స్ పార్ట్ 1 కంటే డబుల్ బడ్జెట్ తో పార్ట్ 2 తెరకెక్కించేందుకు సిద్ధం అయ్యారు.
చూడాలి ఈసారి అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో.