దేశంలో వర్షాలు పడాలి అంటే పలు మార్గాలు గురించి వినే ఉంటాం.కప్పల పెళ్లిళ్లు చేస్తే వర్షాలు బాగా పడతాయని ఇంకా ఏవేవో మూఢ నమ్మకాలు ఉన్న సంగతి తెలిసిందే.
అయితే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం వర్షం పడడం కోసం వైరైటీ పూజలు చేశారు.వాటి గురించి వింటే మాత్రం నవ్విపోతారు.
వర్షాలు సరిగా పడడం లేదని కర్ణాటక పూజారులు నీళ్లు నింపిన పెద్ద పాత్రలో కూర్చొని మంత్రాలు చదువుతూ నిజంగా చూస్తే మాత్రం తప్పకుండా నవ్వు ఆపుకోలేరు ఎవరైనా.నిజంగానే కర్ణాటక లో పూజారులు ఈ నెల 7 న చేసిన ఈ పూజల తాలూకు ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తుండడం తో అందరూ నవ్విపోతున్నారు.
బెంగుళూరు లోని సోమేశ్వర ఆలయంలో ఈ పూజా తతంగం జరిగింది.అయితే ఈ పూజా తతంగాన్ని ట్రోల్ చేస్తూ నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ పూజారులు తమ ఫోన్ల ద్వారా వరుణుడి మెస్సేజ్ చేస్తున్నారా అని కొందరు, వీళ్లు అసలు మంత్రాలు చదుతున్నారా లేదంటే ఫోన్ల లో ఆడుకుంటున్నారా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి హోమం చేస్తున్నప్పుడు పూజారులు ఇలాంటి పనులు చేస్తే నెటిజన్లు ఆ మాత్రం స్పందించక మానరు.పాపం హోమం సంగతి మరిచిపోయి ఫోన్ చూసుకుంటున్న ఈ పూజారులను మాత్రం నెటిజన్లు బాగానే ఆడుకున్నారు.ఇక ఇది చూసైనా మరొక పూజారి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారేమో.