అనుష్క నటించిన ‘నిశబ్దం’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జరిగింది.ఇదే సమయంలో అనుష్క తన 15 ఏళ్ల సినీ కెరీర్ను పూర్తి చేసుకున్నందుకు సెలబ్రేషన్ చేయడం జరిగింది.
అనుష్కతో వర్క్ చేసిన పలువురు దర్శకులు మరియు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.దర్శకుడు పూరి తెరకెక్కించిన సూపర్ చిత్రంతో అనుష్క పరిచయం అయ్యింది.
అందుకే అనుష్కను అభినందించేందుకు పూరి కూడా హాజరు అయ్యాడు.ఇక రాఘవేంద్ర రావు, రాజమౌళిలతో పాటు ఇంకా పలువురు దర్శకులు హాజరు అయ్యారు.
ఈ సందర్బంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు దర్శకుడు పూరి క్షమాపణలు చెప్పాడు.15 ఏళ్ల క్రితం ఆయన అన్న ఒక మాటకు ఇప్పుడు క్షమాపణలు చెప్పడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది.అసలు విషయం ఏంటీ అంటే సూపర్ చిత్రం షూటింగ్ సమయంలో సెట్స్లోకి రాఘవేంద్ర రావు గారు వచ్చారట.ఆ సమయంలో నాగార్జున డేట్లు అడిగేందుకు అని ఆయన రావడంతో పూరితో కొద్ది సమయం మాట్లాడాడట.
ఆ సమయంలో పూరి నా చిన్నప్పటి నుండి మీ సినిమాలు చూస్తున్నాను.మీరు ఇంకా ఎంత కాలం సినిమాలు చేస్తారు రిటైర్డ్ అవ్వొచ్చు కదా అంటూ సలహా ఇచ్చాను.
ఆ సమయంలో నేను తీసిన సూపర్ సినిమా ఫ్లాప్ అవ్వగా రాఘవేంద్ర రావు డేట్లు కోరిన అన్నమయ్య సినిమా మాత్రం హిట్ అయ్యింది.ఆ సమయంలో ఆయనకు ఇచ్చిన ఉచిత సలహా ఆయన్ను ఎంతగా బాధపెట్టి ఉంటుందో అని నాకు అనిపించింది.
అందుకే ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాను అంటూ పూరి కాస్త ఎమోషన్ అయ్యాడు.