ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కి్స్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యా్క్డ్రాప్తో తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.
కాగా ఈ సినిమాలో విజయ్ ఓ బాక్సర్గా కనిపిస్తాడు.అయితే పూరి ఈ సినిమాలో యాక్షన్తో పాటు ఎమోషన్ను కూడా భారీ స్థాయిలో చూపెట్టేందుకు రెడీ అవుతున్నాడట.
గతంలో పూరి డైరెక్ట్ చేసిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం తరహాలో ఇది కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతూనే ఎమోషనల్ కంటెంట్ను కలిగి ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
అటు విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఫిక్స్ అయ్యాడు.
ఇటీవల అతడు నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడంతో ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ కొట్టి తీరాలనే కసితో అతడు ఉన్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ను అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.