ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.బండ్ల గణేష్ ఏ ఉద్దేశంతో మాట్లాడినా ఆ కామెంట్లు అటు బండ్ల గణేష్ ను ఇటు ఛార్మీని కించపరిచే విధంగా ఉన్నాయని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
పూరీ మ్యూజింగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పూరీ జగన్నాథ్ ఒక షార్ట్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ఆ వీడియోలో పూరీ జగన్నాథ్ మన నాలుక కదులుతున్న సమయంలో మనం ఏమీ నేర్చుకోలేమని తెలిపారు.
మనం ఎక్కువ సమయం వింటూ ఉండాలని అదే మంచిదని ఆయన చెప్పుకొచ్చారు.కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా ఆఫీస్ మెంబర్స్ అయినా భార్య అయినా ఆచితూచి మాట్లాడాలని చీప్ గా వాగొద్దని పూరీ జగన్నాథ్ అన్నారు.
చీప్ గా వాగొద్దని చీప్ గా ప్రవర్తించొద్దని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
మన కెరీర్, క్రెడిబిలిటీని వాగుడు డిసైడ్ చేస్తుందని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.
తప్పు మాట్లాడటంతో పోలిస్తే నాలుకను కొరికేసుకోవడం తన దృష్టిలో మంచిదని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.నీ జీవితం నీ చావు నాలుకపైన ఆధారపడి ఉంటుందని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.
బండ్ల గణేష్ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండానే పూరీ జగన్నాథ్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో బండ్ల గణేష్ నిర్మాతగా ఇద్దరమ్మాయిలతో, టెంపర్ సినిమాలు తెరకెక్కాయి.ఈ సినిమాలలో ఇద్దరమ్మాయిలతో నష్టాలను మిగల్చగా టెంపర్ సినిమా సక్సెస్ సాధించింది.టెంపర్ సినిమా తర్వాత బండ్ల గణేష్ సినీ నిర్మాణానికి దూరమైన సంగతి తెలిసిందే.
పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాకు దర్శకత్వం వహించగా ఆగష్టు నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
తాజా వార్తలు