హీరో విజయ్ దేవరకొండ నేడు తన 33వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈక్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు సెలబ్రిటీలు తమ అభిమాన నటుడికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ హంగామా మొదలైంది.అలాగే ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే విజయ్ పుట్టినరోజు కావడంతో పూరి జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ విషెస్ చెబుతూ… విజయ్ నీ గుండెల్లో ఉన్న మంటని చూసా… నీలో దాగున్న నటుడిని చూసా.నీ మనసు ఏం ఆలోచిస్తున్నావ్ నాకు తెలుసు నటన పట్ల నీకున్న ఆకలి, కసి, పట్టుదల ఇవన్నీ నువ్వు విజయం సాధించేలా చేస్తాయి.
ఏదో ఒక రోజు నిన్ను నటుడుగా దేశం గర్వపడేలా చేస్తాయి అంటూ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండకు బర్తడే విషెస్ తెలియజేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో జనగణమన అనే సినిమా కూడా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.ఇకపోతే విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఓ సినిమాలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా కూడా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని షూటింగ్ పనులను ప్రారంభించింది.