తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలకి ఉన్నటువంటి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటి వరకూ పూరి జగన్నాథ్ తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నుంచి జూనియర్ వరకు దాదాపుగా అందరి సార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి బాగానే మెప్పించాడు.
అయితే ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఇంటి పట్టునే ఉంటున్నాడు.
దీంతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని కథను సిద్ధం చేసుకున్నాడు.అంతేగాక ఈ చిత్రానికి సంబంధించి నటువంటి టైటిల్ ని కూడా “ఆటో జానీ” అనే పేరుని పరిశీలిస్తున్నారట.
అయితే ఇప్పటికే ఈ కథని చిరంజీవికి వినిపించడంతో క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలలో కొంతమేర మార్పులు చేర్పులు కావాలని చిరంజీవి అడగడంతో ప్రస్తుతం పూరి జగన్నాథ్ మెరుగులు పనిలో పడ్డాడట.అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరి నుంచి మెగాస్టార్ మరియు పూరి జగన్నాథ్ ల క్రేజీ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “ఫైటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ప్రస్తుతం ఈ చిత్రం ముంబై పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.
కాగా ఈ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.