గత కొన్ని రోజులుగా స్టార్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ పూరీ మ్యూజింగ్స్ లో వీడియోల ద్వారా వివిధ అంశాల గురించి స్పందిస్తున్నారు.తాజాగా పూరీ జగన్నాథ్ సింప్లిసిటీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రెజెంట్ ను అంగీకరించమే సింప్లిసిటీ అని.సింప్లిసిటీతో బ్రతకడం అంత సులువు కాదని పూరీజగన్నాథ్ చెప్పారు.అతి కష్టమైన వాటిలో సింప్లిసిటీ కూడా ఒకటని.మొండిగా అదే కావాలని కూర్చుంటే కుదరదని అన్నారు.
అనుకున్నది అనుకున్న విధంగా జరగకపోవడమే జీవితం అని.లైఫ్ పర్ఫెక్ట్ కాదని.నువ్వు కూడా పర్ఫెక్ట్ కాదని పూరీ చెప్పారు.జీవితంలో అడ్జస్ట్ కావడం ఎంతో ముఖ్యమైనదని తెలిపారు.గుడికి వెళ్లి మన కోరికలను చెప్పుకుంటామని.దేవుడికి అప్పుడు ఆ కోరికలు తీర్చకూడదు అని అర్థమవుతుందని పేర్కొన్నారు.
దేవుడు ఆ కోరిక ఎట్టి పరిస్థితుల్లో తీరకుండా తన పుస్తకంలో రాసుకుంటాడని పేర్కొన్నారు. ఎన్నో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్లు సైతం సింపుల్ గా జీవనం సాగిస్తున్నారని.
ప్రపంచంలో టాప్ సీఈవోలుగా చలామణి అవుతున్న వాళ్లు చిన్న చిన్న ఇళ్లలోనే నివశించారని.అంత పెద్ద హోదాల్లో ఉన్నా వాళ్లు లైఫ్ గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయరని పేర్కొన్నారు.
మనం జీవితంలో ఏవి కావాలో ఏవో వద్దో తెలుసుకోవాలని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.సింప్లిసిటీ అంటే పేదరికంలో బ్రతకడం కాదని చెప్పారు. పూరీ మ్యూజింగ్స్ వీడియోల ద్వారా పూరీ తనలోని భావాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.మరోవైపు ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తరువాత పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ ఈ సినిమాతో తనకు పోకిరి లాంటి హిట్ దక్కుతుందని భావిస్తున్నారు.