ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టి ఫుల్ జోష్ మీద ఉన్నటువంటి రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి ఆటో జానీ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ చిరంజీవి 150వ చిత్రం కంటే ముందుగానే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఏమైందో ఏమో గాని ఈ చిత్రం మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది.
అయితే ఇందుకు గల కారణాలను కూడా పూరి జగన్నాథ్ పలు సందర్భాల్లో వివరించాడు.అయితే ఇప్పటికే తాను చిరంజీవి కోసం ఆటో జానీ చిత్ర కథను సిద్ధం చేసుకున్నానని ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఈ విషయమై చిరంజీవిని కలిసి కథ కూడా వివరించానని అన్నారు.
అయితే పూర్తి కథ విన్నటువంటి చిరంజీవి కథలో కొన్ని మార్పులు చేర్పులు కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అందుకోసమే కొద్దిరోజులు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ చిత్రం విషయమై పూరి జగన్నాథ్ మెగాస్టార్ ని మళ్ళీ సంప్రదించాడట. ఇందులో భాగంగా కథలో తాను చేసినటువంటి మార్పులు చేర్పుల గురించి పూర్తిగా వివరించడంతో చిరంజీవి కూడా కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే అన్ని సక్రమంగా కుదిరితే తొందర్లోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని సీనియర్ నటి ఛార్మి మరియు కరణ్ జోహార్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.