పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
విజయ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని ముంబైలో పూర్తి చేశారు.
బాక్సింగ్, మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మెయిన్ స్టోరీ తండ్రి, కొడుకుల చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది.ఇక ఇందులో విలన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడు.
అలాగే విజయ్ దేవరకొండ తండ్రి పాత్రలో మలయాళీ స్టార్ సురేష్ గోపి కనిపించబోతున్నాడు.ఇక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుంది.
రౌడీ విజయ్, పూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని లాక్ డౌన్ తర్వాత స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
అయితే ఈ షెడ్యూల్ లో అమెరికాలో షూట్ చేయాలని ప్లాన్ చేశారు.అక్కడ కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉండటం, దాంతో పాటు వీసాలు మంజూరు కాకపోవడంతో ఈ అమెరికా షెడ్యూల్ ఆగిపోయింది.
దీంతో తప్పనిసరి పరిస్థితిలో పూరి అమెరికా షెడ్యూల్ ని వెనక్కి పంపించి ఇండియాలో షూట్ చేయాల్సిన మిగిలిన పార్ట్ మొత్తం కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.ఈ నేపధ్యంలో వచ్చే నెల నుంచి సెకండ్ షెడ్యూల్ లో ముంబైలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.
అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది డేట్ మెన్షన్ చేయకపోయిన జనవరి నుంచి షూటింగ్ పక్కాగా స్టార్ట్ అవుతుందని మాత్రం తెలుస్తుంది.