పూరీ జగన్నాథ్ – తెలుగు సినిమాలో చాలా త్వరితగతిన ఒక సినిమా పూర్తి చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు.ఇంత త్వరగా ఒక సినిమా తీయగాలగాదానికి పూరీకి పెద్ద సీక్రెట్ ఉంది.
ఆయన వెనకాల చాలా మంది స్టాఫ్ ఉంటారు.పైగా తన వైష్ణో మీడియా వ్యవహారం కూడా వుంది.
అందువల్ల కాస్త స్టాఫ్ ఎక్కువే.
అందుకే మంచి ఆఫీసు కూడా కట్టాడు.
దర్శకుల్లో ఎవరికీ లేనంత మంది సిబ్బంది, ఆఫీసు పూరికి వున్నాయి.పూరీ తన స్టాఫ్ విషయంలో అసంతృప్తి గా ఉన్నాడు అని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి.వారిమీద తనకి ఉన్న అసహనం వారితో కూడా చెప్పేలా పెద్ద మెసేజీ ని వారికి పంపించాడు అని.” మీరు నాకు ఇకమీదట ఒద్దు” అనేది అందులోని సారాంశం అని అంటున్నారు.
చార్మీ – పూరి ల ఫ్రెండ్షిప్ గురించి లీక్ చేసింది తన స్టాఫ్ అని తెలుసుకున్న పూరీ చాలా సీరియస్ గా ఉన్నాడు అని అంటున్నారు.పైగా చేతిలో రోగ్ తప్ప సినిమాలేవీ లేవు పూరీ కి , మరీ రోటీన్ యాటిట్యూడ్ తో సినిమాలు తీస్తూ ఉండడం తో పవన్ కళ్యాణ్ లాంటి వారు పూరీ వైపు చూడ్డం లేదు కూడా అయితే ఈ రోగ్ తరవాత ఏ సినిమాకీ పూరీ ఇంకా సంతకం పెట్టలేదు కూడా.
ఈ నేపధ్యంలో తన చిరాకు స్టాఫ్ మీద చూపిస్తూ , చార్మీ అంశాన్ని వంకగా చూపించి సగానికి సగం మందిని పీకేస్తున్నాడు అని టాక్.